Common Men Forum - Voter's Manifesto కామన్ మెన్ ఫోరమ్ - ఓటర్స్ మ్యానిఫెస్టో
కామన్ మెన్ ఫోరమ్ - ఓటర్స్ మ్యానిఫెస్టో
1. పేద మధ్య తరగతిలోని నిరుద్యగ యువతకు 18000 రూపాయలతో ఉపాధి.
2. రాష్ట్రంలో
ప్రజలకు ఉచితంగా ప్రైవేట్ వ్యవస్థకు దీటుగా నాణ్యమైన విద్యా,వైద్యం గ్రామ
స్థాయి నుండి ఏర్పాటు చేయడం. ప్రైవేట్ విద్య వైద్యం వ్యవస్థను క్రమబద్దీకరిస్తూ
దశలవారీగా ప్రభుత్వ అధీనంలో తీసుకోవడం.
3. ప్రజందరికీ
అందుబాటులో గ్రామ స్థాయి నుండి ప్రభుత్వ సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయడం. ప్రతి
నిత్యం ప్రజలు చెల్లిస్తున్న పన్నులు నేరుగా ఎటువంటి అవినీతి ఆస్కారం లేకుండా
ప్రభుత్వ ఖజానాకు చేరవేయటం.
4. స్వంత ఆస్తి అంటూ లేని పేద, మధ్య తరగతి
ప్రజలకు స్థలం కల్పించడం.
5. మంచినీరు, విద్యుత్తు, గ్యాస్ సేవలను
పేద, మధ్యతరగతి
ప్రజలకు తక్కువ ధరలకు అందించాలి.
6. ఇంటి, వ్యాపార రుణాలు
అర్ధ రూపాయి వడ్డీకే పేద,
మధ్య తరగతి
ప్రజలకు అందించాలి.
7. ప్రభుత్వ వ్యవసాయ
రంగం ద్వారా నూతన ఉపాధి అవకాశాలతో వ్యవసాయ రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయడం.
8. రైతులకు
విత్తనాలు, ఎరువులు,నీరు, విద్యుత్తు ఉచితం
మరియు పెట్టుబడి సహాయం.
9. ప్రతి మండలంలో నూతన పరిశ్రమలు నిర్మించి
నాణ్యమైన ఉత్పత్తులు, ఎగుమతులు చేసే
విధంగా, ఉపాధి అవకాశాలు
పెంచే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం. మహిళలకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు
కల్పించడం.
10. సమాన పనికి సమాన వేతనం వెంటనే అన్ని రంగాల్లో
అములు చేయండి.
11. కాంట్రాక్టు
వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగ భద్రతను కల్పిస్తూ పర్మినెంట్ చేయండి.
12. ఒక్క ప్రభుత్వ
పోస్ట్ కూడా ఖాళీ లేకుండా అన్నీ ఖాళీలు భర్తీ
చేయండి.
13. ఏ ఆధారం లేని
వృద్దులకు, వికలాంగులకు 6000 రూపాయలతో
చేయూతనిది కల్పించండి.
14. రాజకీయ లబ్ధి
కోసం ఏర్పాటు చేసిన ప్రజా పథకాలను వెంటనే రద్దు చేయండి.
15. ప్రభుత్వ వృధా
ఖర్చులను, ఆడంబర ఖర్చులను
పూర్తిగా నిషేధించండి.
16. రాష్ట్రంలో
అక్రమార్కుల చేతిలో ఉన్న ప్రతి అవినీతి పైసాను ఏ మూలా ఉన్న వెన్నక్కి తీసి “పబ్లిక్ వెల్ఫేర్
ఫండ్లో” జమ చేయండి.
17. కులరహిత, మత రహిత
సమాజాన్ని ప్రోత్సహించి ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం అందించండి.
18. విద్యా,వైద్యం,న్యాయం, ఉపాధి, నివాసం, ఆర్ధిక, సామాజిక
అభివృద్ధి అవకాశాలు పేద,మధ్య,ధనిక అనే వత్యాసం
లేకుండా అందరకీ అందే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి మడలంలో ప్రతి జిల్లాలో ప్రజా
పరిషత్ అనే ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి. ఈ శాఖ ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రి
మండలి సభ్యుల పర్యవేక్షణలో నడవాలి. సమస్యల పరిష్కారం డిజిటల్ రూపంలో ఎప్పటికప్పుడు
ప్రజలకు అందించాలి.
19. ధనవంతులు అంటే
ఎవరు? ఒక సూచికను
రూపొందించడం. ధనవంతుల జాబితా తాయారు చేసి, ధనవంతుల సంపద పై ప్రత్యేక పన్ను విధానం అములు
చేయండి. ధనవంతులకు రాజకీయాల్లో 5% రిజర్వేషన్ కల్పించండి.
20. ప్రజల వద్ద ఉన్న అన్నీ రకాల ఆస్తులను వాస్తవ
మార్కెట్టు ధరకు లెక్కకట్టి ఒక నిర్దిష్ట మైన నిజమైన పేద మరియు మధ్య తరగతి ప్రజలను
గుర్తించడం. ఉపాధి, సంక్షేమ అవకాశాలు
అర్హులైన నిజమైన పేద మరియు మధ్య తరగతి ప్రజలకే అందేలా చేయండి.
21. భూములు, ఇతర సంపదలు
వాస్తవంగా కొనుగోలు అమ్మకాలు జరుగుతున్న ధరలకే ప్రజలు పన్నులు చెల్లించే విధంగా
కఠినమైన చట్టాలు చేయండి.
22. ప్రజాసేవలు
అందిస్తున్న అన్ని స్వచ్చంద సంస్థలకు ప్రతేక నిధులు కేటాయించండి.
ప్రభుత్వాలు
తలచుకుంటే చట్టాల్లో చిన్నచిన్న మార్పుచేర్పులతో “ఓటర్స్
మ్యానిఫెస్టో ”ను
సులువుగా అతి కొద్ది కాలంలోనే సాధించుకోవచ్చు.
“పేదరికం, ఆర్ధికఅసమానతలు
దేవుడు పుట్టించినవి కావు, మన చట్టాలు సరిగ్గా లేక పుట్టుకొచ్చాయి”.
“జనతా
మ్యానిఫెస్టో”ను
సాధించుకోవడానికి ఎన్నో రకాల అవకాశాలు వనరులు మానవ శక్తి సమృద్ధిగా మన దేశంలో
ఉన్నాయి.
దేశం
లో చెడు పెరగడానికి కారణం చెడు చేసే వాళ్ళు పెరగడం కారణం కాదు,ఆ
చెడును సహిస్తున్న ప్రజలు దేశంలో పెరిగి పోవడమే కారణం.
సంపూర్ణ
స్వాతంత్య్రంతో సంతోషంగా జీవించే అవకాశాలు ఈ దేశంలో ఉన్నప్పటికీ, బానిసలుగా అలాగే జీవిస్తున్న ప్రజలకన్న, సంపూర్ణ
స్వాతంత్య్రం కోరుకునే ప్రజలు లక్ష రెట్లు మేలు.
ఈ
అనంత విశ్వంలో జీవరాశి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నదో అనే పరిశోధనలతో సాగరగర్భం నుండి
అంతరిక్షం అంచుల వరకు నిరంతరం శోదిస్తున్నారు. వివిధ రకాల క్రీడలు, సాహస
విన్యాసాలు,
ఎతైన
భవనాలు, విగ్రహలపైన
ఎన్నో కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారు.
అయితే
ఇంతటి అపార జ్ఞానం, విజ్ఞానం, సాంకేతిక టెక్నాలజీతో ఇన్ని
విజయాలు సాధిస్తున్న ఈ కాలంలో “ఓటర్స్ మ్యానిఫెస్టో ”ను
సాధించడం అసాధ్యం కానే కాదు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో
పేదరికానికి,
నిరుద్యోగానికి
ఆత్మహత్యలకు,
ఆర్ధిక
అసమానతలకు కారణం, సమాన విద్య, వైద్యం, గృహ
ఉపాధి అవకాశాలు అందరికి అందకపోవడానికి కారణం, దేశ సంపదపై జరుగుతున్న
దౌర్జన్యానికి,
దోపిడీకి, అవినీతికి
కారణం, దేశంలో
కుల, మత, భాష, ప్రాంత
వర్గ విభేద సమస్యలకు కారణం ఈ దోపిడీ నిరంకుశత్వ కాంగ్రెస్ పార్టీయే కారణం అన్నారు, కాంగ్రెస్
పార్టీను గద్దె దించి ఆ తరువాత బిజెపి పార్టీను గద్దె ఎక్కించాము అయినా సమస్యలు
ఇంకా పరిష్కరించ బడలేదు ఆ తరువాత ఈ సమస్యలకు కారణం అగ్ర వర్ణల అగ్ర కులాల
ఆధిపత్యమే,
మత
తత్వ రాజకీయాలే కారణం అని అంటున్నారు. బహుజన్ సమాజ్ వాద్ పార్టీలు, బహుజనుల
రాజ్యాధికారం నినాదంతో రాజకీయ పార్టీలు అధికారంలో వచ్చాయి, ఇంకా
ఈ నినాదంతో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా సమస్యలు పరిష్కరించ బడలేదు. అన్ని
రాజకీయపార్టీలు కలిసి తమ రాజకీయ ఆధిపత్యం కోసం దేశంలో ప్రజలు ఏకకం కాకుండా వర్గ
ద్వేషాలు పెంచి పోషించడంలో ఓటర్లను సంఘటితం కాకుండా విడకొట్టడంలో నూటికి నూరు శాతం
విజయం సాదించగలిగాయి. అంతేకాదు భాషా పరంగా, ప్రాంతాలపరంగా ప్రజలను విడగొట్టి
అధికారం చేపట్టిన రాజకీయ పరిణామాలు కూడా మనం చూసాము. సంకర జాతి బుద్ది గల రాజకీయ
పార్టీలు అధికారం కోసం, మిత్ర కూటమి అనే పేరుతో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను
విలువలను గాలికి వదిలేసి కేవలం అధికారం, ఆధిపత్యం కోసం, అధికార
పార్టీని గద్దెదించడానికి రాజకీయ పార్టీల మరియు నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో
అధికారంలోకి రావడం పోటీ పడుతుండటం కూడా
ఇంకా మనం చూస్తూనే ఉన్నాము. వాస్తవానికి అసలు ఇవి రాజకీయ పార్టీలు కావు, పెట్టుబడిదారుల
ధనవంతుల, దోపిడీదారుల
యొక్క పెంపుడు గ్యాంగులు.
మొదట్లో
దేశంలో ఒకటి రెండు రాజకీయ పార్టీలు మాత్రమే ఉండేవి కానీ ఈ రోజు 2900 లకు పైగా రిజిస్టర్డ్ రాజకీయ
పార్టీలు ఉన్నాయి, అలాగే
లక్షల్లో స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్ని క్రొత్త పార్టీలు పుట్టుకొచ్చిన కేవలం ఒక 1 నుండి 5
రాజకీయ పార్టీలు, అది
కూడా కేవలం ధనవంతుల మోచేయి క్రింద నీళ్లు తాగే స్వార్ధ రాజకీయ పార్టీలే తమ ఉనికిని
చాటుకుంటున్నాయి, ధనవంతుల
కుట్ర రాజకీయ ఎత్తుగడలతో రవ్వంతకూడా పార్టీ కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు అనుమానం రాకుండా ధనవంతులు కోరుకున్న
పార్టీకి రాజకీయ అధికారం అందే విధంగా ప్రజల ఓట్లను విడగొట్టి ఆటలాడుతున్నారు. ఈ
ఆటలో ప్రజల పాత్ర కేవలం వారి ప్రలోభాలకు వర్గ విభేదాలకు ఆడంబరాలకు బానిసై ఓటు
వేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న అది ధనవంతుల ఇంటి
బానిసై ఉండాలి.
అయితే
ప్రజలు ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ
ప్రజాస్వామ్యం కాదు ధనవంతుల సామ్రాజ్యం నడుస్తుంది. దీనిని ప్లుటోక్రసీ అంటారు
ప్రజాస్వామ్యం అనరు. దేశంలో ప్రధాన సమస్యలు ఇప్పటికి ఇంకా పరిష్కరించబడలేదు, ప్రజల ప్రధాన కనీస అవసరాలు ఇంకా తీరలేదు.
అసలు ఈ సమస్యలు ఎందుకు పరిష్కరించ బడవు అంటే, ఎప్పుడైతే
ప్రజలు ఆర్ధికంగా స్వేచ్ఛ పొందుతారో, సామాజికంగా, రాజకీయంగా ఎదిగి, దేశ సంపద ఫలాల్లో వారి వంతు భాగస్వామ్యాన్ని
ఒక హక్కుగా కోరుతారు, అప్పుడు
దేశ సంపదను ప్రజలందరికి వికేంద్రీకరణ చేయవలసి వస్తే, దోపిడీదారులు
అక్రమంగా నిర్మించుకున్న వారి సామ్రాజ్య కోటలు ప్రజలు బద్దలు కొట్టక తప్పదు. దేశ
సంపదపై రాజకీయాలపై వారి కున్న ఆధిపత్యం నశించక తప్పదు అందుకే దేశంలో పేదరికాన్ని, బానిసత్వాన్ని, ఆర్ధిక, సామాజిక అసమానతలను, కుల, మత
ప్రాంత, వర్గ విభేదాలను పెంచి , ప్రజల ఐక్యతను విడగొడుతూ ప్రజలను ఆర్ధిక
స్వేచ్ఛను దూరం చేసి ,ఇంకో
1000 సంవత్సరాల పాటు ఈ సమస్యలను
పెంచిపోషిస్తునే ఉంటారు తప్ప సమస్యలను ఎప్పటికి పరిష్కరించరు.
1. రాజకీయ
పార్టీల బానిసత్వం Slavery of
political parties
2. ఆర్ధిక
అసమానతలు Economic
inequalities
3. అవినీతి
Corruption
4. నల్లధనం
ఉనికి Presence of black money
5. ప్రవేటీకరణ
Privatization
6. నేర
చరిత్ర గల పాలకులు Rulers with
criminal records
7. సొంత
ఇల్లు లేకపోవడం Lack of own house
8. పేదరికం
Poverty
9. నిరుద్యోగం
Poverty
10. పౌష్టికాహారలోపం
Malnutrition
11. శిశు
మరణాలు Infant mortality
12. అందరికి
అందుబాటులో లేని విద్య. (విద్యా వ్యవస్థ) Education not accessible to all. (Education system)
13. అందరికి
అందుబాటులో లేని వైద్యం. (ఆరోగ్య సంరక్షణ
వ్యవస్థ) . Medicine not
available to all. (Health care system)
14. వ్యవసాయ
కష్టాలు Agricultural
hardships
15. చిన్న
వ్యాపారుల కష్టాలు Distress of Small
Traders
16. పారిశుధ్యం
Sanitation
17. మౌలిక
సదుపాయాలు Infrastructure
18. ఆర్ధిక
పరమైన వత్తిళ్లతో పేద మధ్య తరగతి ప్రజల
ఆత్మహత్యలు Suicides of poor
middle class people due to financial stress
19. రైతుల, చేనేత, కర్షక, కార్మిక ప్రజల
ఆత్మహత్యలు Suicides of
farmers, weavers and laborers
20. పర్యావరణ
కాలుష్యం Environmental
pollution
21. అధిక
జనాభా Overpopulation
22. అధిక
ధరలు High prices
23. అధిక
నేరాలు High Offenses
24. బిక్షాటన, నిరాశ్రయులు Beggary, destitute
25. వ్యభిచారం
Adultery
26. బాలకార్మికలు
Child labour
27. ఆకలి
చావుల సమస్య Problem of
starvation
28. నిరక్షరాస్యత
Illiteracy
29. మహిళలపై
వేధింపులు Violence against
woman
30. వివక్ష
మరియు సామాజిక అసమానత Discrimination
and social inequality
31. కుల,మత,ప్రాంత,వర్గ ఘర్షణలు Caste, religion, region and class conflicts
32. ప్రజా
ధనం దుబారా Wastage of public
money
33. కుటుంబ
సభ్యుల మధ్య ఒత్తిడి Stress
between family members
34. తీవ్రవాదం
Terrorism
35. మారణహోమం
Genocide
36. మాదకద్రవ్య
వ్యసనం Drug addiction
ఇంకా ఇలా ఎన్నో సమస్యలు ఈ
దేశంలో పాతుకుపోయిఉన్నాయి, ఈ అన్ని సమస్యలను జనతా మేనిఫెస్టో ద్వారా
పరిష్కరించవచ్చు. పై సమస్యలను దోపిడీ రాజకీయ పార్టీలు తీర్చక పోగా ఇంకా పెంచి
పోషిస్తునే ఉంటాయి. బ్రతుకు బండిని ఎల్లా కాలం లాగే బానిసలుగా, ఆర్ధిక పరమైన
వత్తిళ్ళతో, ప్రతి నిత్యం సతమతమవుతు చస్తూ బ్రతికే పరిస్థితి, పేద మరియు
మధ్యతరగతి ప్రజల ను తొక్కిపెట్టి అణిచివేస్తూనే ఉంటారు. ప్రజలు సుఖంగా బ్రతక లేరు, బ్రతికి
ఉన్నంతకాలం మరియు చచ్చిన తరువాత కూడా ఈ ఆర్ధిక వత్తిళ్ళను భవిష్యత్తు తరాలకు
వారసత్వంగా ఇస్తూనే ఉంటారు.
75సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓటు
వేస్తుంది కేవలం పెట్టుబడిదారుల బానిసత్వం చేయడానికి, రాజకీయ నాయకుల
ఆస్తులు పెంచుకోవడానికే. నాయకులకు అన్ని రకాల సుఖ భోగాలు దక్కాయి, రాజకీయ పార్టీల
ఆస్తులు పెరిగాయి, ధనవంతుల, పెట్టుబడిదారుల
ఆస్తులు పెరిగాయి, కానీ ప్రజల యొక్క ప్రధాన అవసరాలు ఇంకా తీరలేదు, ప్రధాన సమస్యలు
ఇంకా పరిష్కరించ బడలేదు. ప్రజలు ప్రతి సారి రాజకీయ పార్టీల చేతిలో ఓడిపోయారు, దగా చేయబడ్డారు.
ఇక్కడ ప్రజలు అసలు రోగానికి నకిలీ వైద్యం చేయడం వల్లే ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతుంది.
ప్రజలు కోపంతో, నిరాశతో, విసుగెక్కి రాజకీయ పార్టీలను, నాయకులను
మారుస్తూ వస్తున్నారు, అసలు ప్రజలు పోరాటం చేయవలసింది రాజకీయ
పార్టీలను తెరవెనుక నడుపుతున్న వ్యవస్థ పైన పోరాటం చెయ్యాలి. అంతేకాని పార్టీలను
నాయకులను మారుస్తూ ఉంటె ఎటు వంటి ప్రయోజనం ఉండదు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కాని ఆ స్వాతంత్య
ఫలాలు కొద్దీ మంది స్వార్ధ రాక్షస ధనవంతుల చేతిలో చిక్కుకున్నాయి. ఈ ధనవంతుల
సామ్రాజ్యము కుటిల బుద్దితో 75 సంవత్సరాలనుండి
ప్రజాస్వామ్య పేరు మీద దేశ ప్రజల సంపదను ప్రతి నిత్యం దోచుకుంటూనే ఉన్నాయి. ఇక్కడ
ప్రజలు వ్యవస్థను మార్చలంటే ధనవంతుల చేతిలో చిక్కుకున్న రాజకీయ పార్టీలను విడ నాడి
ధనవంతుల యొక్క సామ్రాజ్యాన్నికుప్పకూల్చి, దేశ సంపద ఫలాల్లో
ప్రతి పౌరున్ని భాగస్వామ్యం చేసే ఒక నూతన రాజకీయ పార్టీను ఏర్పాటు చేసుకోవాలి. ఆ
యొక్క నూతన రాజకీయ పార్టీ వ్యవస్థాగత నిర్మాణం నుండి అంతిమ విజయం వరకు ప్రజలందరి
సహకారం ఉండాలి.అప్పుడే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని, బలవంతుడు
బలహీనున్ని,ధనవంతుడు పేదవాన్ని దోచుకునే వ్యవస్థనుండి, కేవలం తిండి
కోసమే పనిచేసే బానిసత్వ వ్యవస్థ నుండి ప్రజలు విముక్తి పొందుతారు. ప్రతి వ్యక్తి
తన కుటుంబంతో సంతోషంగా జీవించ గలుగుతాడు, సమాజం పట్ల దేశం
పట్ల ఉత్సహంతో పని చేయగలుగుతాడు, భద్రత గల నాణ్యమైన
జీవనాన్ని ప్రతి తండ్రి ,ప్రతి తల్లి తన కుటుంబానికి ధైర్యంతో నమ్మకంతో
అందించగలగడం సాధ్యమవుతుంది. విద్యలో, వైద్యంలో, ఉపాధిలో, ఉద్యోగాల్లో సమాన
అవకాశాలు మరియు మెరుగైన సదుపాయాలు ఎటువంటి వివక్షత లేకుండా ప్రతి ఒక్కరు చాలా సులువుగా
పొందగలుగుతారు. మత ఘర్షణలు,కుల వివక్షతలు, భాష మరియు ప్రాంత
అసూయలు నశిస్తాయి.
జనతా మ్యానిఫెస్టో లక్ష్యాలను సాధించే దిశలో
ప్రజల్లో భావజాలవ్యాప్తి చైతన్యం మరియు సహాయ సహకారం చాలా అవసరం. విడిపోయిన
ఓటర్లందరిని సంఘటితం చేయాలి, దేశ జనం ఒక రాజకీయ పార్టీ శక్తిగా ఎదిగి, ఈ దోపిడీ
సామ్రాజ్యాన్ని అంతం చేసి సంపూర్ణ స్వాతంత్య్రంను దేశ ప్రజలకు, భావితరాలకు జనతా
మ్యానిఫెస్టో ద్వారా అందివ్వాలి.
చివరగా ఒక్క మాటగా వినండి
1. పోరాడండి. 2. పోరాడలేకపోతే, పోరాటం గురుంచి
పది మందికీ చెప్పండి.
3. పది మందికీ చెప్పలేకపోతే, పోరాడుతున్నవారికి సహాయం చేయండి.
4. సహాయం కూడా చేయలేకపోతే, పోరాడుతున్న వాడి
మనో బలాన్ని పెంచండి.
5. కనీసం ఇది కూడా చేయలేకపోతే, పోరాడుతున్న వాడి
యొక్క మనోబలాన్ని మాత్రం తెంచకండి, ఎందుకంటే మీ వంతు పోరాటం
కూడా వాడే చేస్తున్నాడు కాబట్టి.
మా పోరాటానికి మీ మద్దతు ఇవ్వాలని తమరిని
కోరుతూ “ఓటర్స్
మ్యానిఫెస్టో ”ను
పరిశీలించి మీ
పూర్తి ఆమోదం తెలుపవలసిందిగా కోరుతుతున్నాము. మీ అభిప్రాయాలను సలహాలను సూచనలను
తెలియ చేయవలసిన ఫోన్ నెంబర్: 9441 25
65 45 & 9154 25 65 45
సర్వే జనాః
సుఖినో భవన్తు
సర్వ జన హితాయ
సర్వ జన సుఖాయ
JAYA PRAKASH BHARAT (JP BHARAT)
SOCIAL POLITICAL REFORMER & MOTIVATIONAL SPEAKER
9441256545
PRESIDENT
COMMON MEN FORUM
Comments
Post a Comment